ప్రమాదాల నివారణకు ఇక ఆ ప్రాంతాల్లో ఎరుపు రంగు రోడ్లు!

  • వన్యప్రాణులు మృత్యువాత పడకుండా ఎన్‌హెచ్ఏఐ వినూత్న ఆలోచన
  • సెన్సిటివ్ జోన్‌లలో రోడ్లపై ఎర్రని రంగుతో మార్కింగ్
  • జబల్‌పూర్-భోపాల్ జాతీయ రహదారిలో 12 కిలోమీటర్ల మేర ఇప్పటికే రోడ్డు
అటవీ ప్రాంతాల్లో రోడ్లపై తరుచూ ప్రమాదాలు జరిగి వన్యప్రాణాలు మృత్యువాత పడకుండా ఉండేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) వినూత్న ఆలోచన చేసింది. ఇందుకోసం సెన్సిటివ్ జోన్‌లలో రోడ్లపై చతురస్త్రాకారంలో ఎర్రని రంగుతో మార్కింగ్ చేస్తారు. ఈ రోడ్డు నలుపు, ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇప్పటికే జబల్‌పూర్-భోపాల్ జాతీయ రహదారిలో ఇలాంటి రోడ్డు కనిపిస్తోంది.

నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం మీదుగా వెళ్లే రహదారిలో ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్ఏఐ రోడ్డుపై ఎరుపు రంగుతో పెయింట్ వేసింది. ఈ రోడ్డు 12 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇంతకుముందు ఈ రోడ్డు రెండు లైన్లుగా ఉండగా, ఎన్‌హెచ్ఏఐ ఇప్పుడు దీనిని నాలుగు లైన్లుగా మార్చింది. వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

NHAI
National Highways Authority of India
Road accidents
Wildlife conservation
Red color roads

More Telugu News